శంషాబాద్ రూరల్ : మండలంలోని ముచ్చింతల్లో ప్రధాని కార్యక్రమానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాలమాకుల గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద రోడ్డును వెడల్పు చేస్తున్న సంబంధిత వ్యక్తులు మిషన్ భగీరధ పైపులైన్ను కట్ చేశారు.
దీంతో పాఠశాలకు తాగునీరు రావడంలేదు. పాఠశాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. సబంధిత అధికారులు చొరవ తీసుకుని కట్ అయిన పైపులైన్ను తిరిగి వేయాలని ప్రిన్సిపల్ విష్ణుప్రియ కోరుతున్నారు.