ఎల్బీనగర్ : సరూర్నగర్ చెరువు వరదనీటి ముంపు నుండి కాలనీలను కాపాడేందుకే వరదనీటి కాలువలను నిర్మాణం చేస్తున్నామని, కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు.
గురువారం ఉదయం గడ్డిఅన్నారం డివిజన్లోని కోదండరాంనగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ కందికంటి ప్రేంనాథ్గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ వరదనీటి కాలువల నిర్మాణం విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు.
సరూర్నగర్ చెరువు నుండి రెండు వరదనీటి పైప్లైన్ పనులు చైతన్యపురి మూసీ నాలా వరకు నిర్మాణం జరుగుతుందన్నారు. కోదండరాంనగర్, చైతన్యపురి ద్వారా ఒక పైప్లైన్, సరూర్నగర్ డీ జోనల్కార్యాలయం మీదుగా మరోపైప్లైన్ నిర్మాణం చేస్తున్నామన్నారు. రాబోయే వర్షాకాలం నాటికి ఎలాంటి వరద ముంపు లేకుండా చేసేందుకు ప్రణాళికాబద్దంగా సమగ్ర నాలా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కార్యదర్శి చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, వి. వెంకటేశ్వర్లు, కోశాధికారి రామేశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శులు శరత్కుమార్, యాద శంకర్, వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులు సుధాకర్, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.