వనస్థలిపురం : ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సుధీర్రెడ్డి 1987లో అక్బర్ బాగ్ కార్పొరేటర్ గా ఉన్న సమయం నుంచి నిర్వహిస్తున్నసూర్యుడి కంటే ముందుగా మన సుధీరుడు మార్నింగ్ వాక్ కార్యక్రమానికి 34 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ఆదివారం బీఎన్రెడ్డినగర్ డివిజన్లోని పలు కాలనీల్లో విస్తృతంగా మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించేం దుకు కృషి చేస్తున్నామన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషిచేస్తూనే ఉన్నామన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామన్నారు. 1987లో ప్రారంభించిన మార్నింగ్ వాక్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉందన్నారు. సహకరించిన ప్రజలు, కార్యకర్తలను ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, కొత్త శ్రీధర్గౌడ్, మాధవరం నర్సింహ్మారావు, గంగం శివశంకర్, సతీష్ దరి, పోగుల రాంబాబు, చేపూరి శంకర్, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.