గోల్నాక : ప్రణాళికా బద్ధంగా నియోజకవర్గం అభివృద్థి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబధించి భవిష్యత్తు తరాలకు అనుగుణంగా కొత్తగా డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బుధవారం అంబర్పేట డివిజన్లోని ఆకాశ్నగర్లో రూ.8 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటు పనులను స్థానిక కార్పొరేటర్ ఇ విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నా మన్నారు. కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్ మాట్లాడుతూ… అంబర్పేట డివిజన్ వ్యాప్తంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సహకారంతో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడు తున్నామన్నారు