మంథనిరూరల్: అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని ఎక్లాస్పూర్ వద్ద టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. రామగుండం కమిషనరేట్ పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరోంచ నుంచి మంథనికి అక్రమంగా రెండు డీసీఎంలలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని విశ్వసనీయ సమాచారం మేరకు మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ సమీపంలో పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 7లక్షల పైనే ఉంటుందన్నారు. ఆ బియ్యాన్ని, రెండు డీసీఎంలను సీజ్ చేసినట్లు, పట్టుబడ్డ డ్రైవర్లు దుండి నరేశ్, కాసాని కుమార్ను మంథని పోలీసులకు అప్పగించినట్లు వారు తెలిపారు. ఈ తనిఖీల్లో టాస్క్ఫోర్సు సీఐ ఎం. రాజ్ కుమార్, సిబ్బంది మల్లేశ్, శ్రీనివాస్, శంకర్ ఉన్నారు.