అంబర్పేట : శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి శ్రీనివాసనగర్ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ.70 లక్షలు కేటాయిస్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని శ్రీనివాసనగర్ కాలనీ హౌసింగ్ సొసైటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదివారం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం కాలనీకి చెందిన అసోసియేషన్ పెద్దలు తనను కలిసి కాలనీలో కమ్యూనిటీహాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. వారి కోరిక మేరకు తన ఎమ్మెల్యే బడ్జెట్ నుంచి రూ.70లక్షలు ఈ హాల్కు కేటాయిస్తున్నానని పేర్కొన్నారు. కాలనీ వాసులకు నచ్చిన డిజైన్లో అన్ని వసతులు ఉండేలా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామన్నారు. కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు దగ్గరుండి నిర్మాణ పనులను చూసు కోవాలని చెప్పారు. కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డా.జి.నాగశయనరావు, టి.ఎస్.రాజగోపాల్, డి.శివప్రసాద్, శ్రీనివాస్, మురళి, శ్రీధర్, చక్రపాణి, డా.మహాలక్ష్మి, లలిత, మైతిలి, సురేష్, శేషుకుమార్ తదితరులతో పాటు టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు .జీవన్గౌడ్, రాజేష్, శ్రీనివాస్యాదవ్, కోట్ల సంతోష్, దారయోబు, స్వామి, పి.చంద్రశేఖర్, బోట్టు శ్రీను, బీజేపీ నాయకులు మిర్యాల శ్రీనివాస్, టి.వెంకటేశ్, బాలకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.