బంజారాహిల్స్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేండ్లుగా జూనియర్ ఆర్టిస్ట్తో సహజీవనం చేస్తూ మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసం ఉంటున్న యువతి (26) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తోంది.
నాలుగేండ్ల క్రితం ఆమెకు రహ్మత్నగర్లోని వీడియో గల్లీలో నివాసం ఉంటున్న ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని నమ్మించడంతో పాటు అప్పటికే పెళ్లయి ఏడాది బాబు ఉన్నా ఆమెను తాను చూసుకుంటా నని నమ్మించడంతో యువతి భర్తకు విడాకులు ఇచ్చింది.
అప్పటినుంచి వీడియో గల్లీలో గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏడాది క్రితం ప్రసాద్రెడ్డి మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. అప్పటినుంచి బాధితురాలిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తుం డడంతో పాటు ముఖం చాటేశాడు.
ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు ప్రసాద్ రెడ్డిపై ఐపీసీ 354(డి), 420,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.