మైలార్దేవ్పల్లి : పేదల వైద్యం కోసం సీయం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం గగన్ పహాడ్ ప్రాంతానికి చెందిన జే నవనీత సదానంద్కు 56వేల చెక్కును ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ చేతులు మీదుగా అందజేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీయం రిలీఫ్ఫండ్ పేదలకు వరం లాంటిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశట్టిందని అర్హలైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎస్ వెంకటేష్ , ప్రేమ్గౌడ్ ,లక్ష్మిరాజ్ ,సరికొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.