గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
గురువారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ దవాఖానాలో చికిత్స పొందుతున్న అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్కు చెందిన రాధకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.1లక్ష విలువగల ఎల్వోసీ పత్రాన్ని ఆయన బాధితురాలి కుటుంబసభ్యులకు అందజేశారు.