గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
శుక్రవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ దవఖానాలో చికిత్స పొందుతున్న గోల్నాక డివిజన్ జైస్వాల్గార్డెన్కు చెందిన ఆర్.నిఖిల్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.1లక్షా50 వేల విలువగల ఎల్వోసీ పత్రాన్ని ఆయన బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.