గోల్నాక : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
బర్కత్పురకు చెందిన రమీలకు రూ. 32 వేలు, తిలక్నగర్కు చెందిన భారతికి రూ.24వేలు, బతకమ్మకుంటకు చెందిన అనిల్కుమార్కు రూ.24వేలు, ఓవైసీనగర్కు చెందిన రఫెత్ బేగంకు రూ.57వేలు, కాచిగూడకు చెందిన మధుసూదన్రావుకు రూ. 60వేలు, తిలక్నగర్కు చెందిన ఆగమ్మకు రూ.60వేలు, పోచమ్మబస్తీకి చెందిన కె.సరితకు రూ.16వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనారోగ్యానికి గురై పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.