గోల్నాక : అనారోగ్యాలపాలయై దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
సోమవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ స్థానిక దవాఖానాలో చికిత్స పొందుతున్న అంబర్పేట తిరుమలనగర్కు చెందిన ఉదయ్భాస్కర్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.1లక్ష 50 వేల విలువగల చెక్కునుఆయన బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.