గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
బుధవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ దవాఖాన లో చికిత్స పొందుతున్న అంబర్పేట డివిజన్ అనంతరాంనగర్కు చెందిన కె.ప్రేమ్రాజ్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.40వేల విలువగల చెక్కును ఆయన బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు