గోల్నాక : అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో అనారోగ్యానికి గురై దవాఖానాలో చికిత్స పొందుతున్న కాచిగూడ డివిజన్ బర్కత్పురకు చెందిన టి.శ్రీనివాసుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.14వేల విలువగల చెక్కును ఆయన బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.