మన్సూరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేయడమే కాకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు.
నాగోల్ డివిజన్ బండ్లగూడలోని వీ స్పోర్ట్స్అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన టీఎస్టీఏ-2021 అవార్డుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన వివిధ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు మరింతగా రాణించి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, చీఫ్ కోచ్ విశాల్, చీఫ్ రెపరీ కె. సంతోష్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.