భైంసా, డిసెంబర్ 28 : సీఎం సహాయనిధి పేదలకు వరమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. పలువురికి మంజూరైన సీఎం సహా యనిధి చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం కోర్వ చిన్నన్నకు రూ. 1.50లక్షలు, సురేఖకు రూ. 35 వేలు, శశికళకు రూ. 20 వేలు, సునితకు రూ. లక్ష, అంకుష్ కు రూ. 40 వేలు, ముత్తవ్వకు రూ. 23,700, మల్లక్కకు రూ. 15 వేలు, రాణికి రూ. 11 వేలు, పంచశీలకు రూ. 18వేల విలువైన చెక్కులు పంపి ణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, ప్రసన్నజిత్ ఆగ్రే పాల్గొన్నారు.
దేగాంలో..
భైంసాటౌన్/లోకేశ్వరం, డిసెంబర్ 28 : దేగాంలోని తన నివాసంలో బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే విఠల్రెడ్డి అందించారు. టాక్లి గ్రామానికి చెందిన దేవీదాస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డా డు. సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. లక్ష చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందజేశారు. నాయకులు గంగాధర్, దీక్షిత్, పండిత్ పటేల్, చంద్రకాంత్, తదితరులు పాల్గొ న్నారు. లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామా నికి చెందిన నీరడి చిన్ని కుమార్కు రూ. 60 వేలు, గుండ్ల గజేందర్కు రూ. 28 వేల విలువైన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశా రు. సర్పంచ్ సాలయి నరేశ్, ఎంపీటీసీ తోట ఇంద్ర గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.