శంషాబాద్: ఏపీ సీఎం జగన్ ను కలిసిన చినజీయర్ స్వామి సహస్రాభ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు. తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీసులో జీయర్ స్వామి శనివారం జగన్ను కలిశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహానికి సీఎం జగన్ను ఈ ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్ణమయ శ్రీ రామానుజ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అంతకు ముందు తన క్యాంప్ ఆఫీసుకు వచ్చిన చినజీయర్ కాళ్లకు నమస్కరించి సీఎం జగన్ సాధారంగా ఆహ్వానించి ఆహ్వాన పత్రికను తీసుకున్నారు.