మాదాపూర్ : మాదాపూర్లోని కాకతీయహిల్స్ రహదారిలో బుధవారం రూ. 2 వేల నోట్లు కలకలం రేపాయి. స్థానికులు, వాహనదారులు రోడ్డుపై వెళ్తుండగా రహదారి ప్రక్కన పెద్ద ఎత్తున రూ. 2 వేల నోట్ల కట్టలు కనిపించడంతో వాటిని తీసుకు నేందుకు స్థానికులు, వాహనదారులు పోటీ పడ్డారు. దీంతో అందినకాడికి అందినంత నోట్లను తీసుకొని అక్కడి నుండి వెళ్ళి పోయారు.
అక్కడే ఉన్న మరికొంత మంది నోట్లను పరిశీలించి చూడగా నోట్లపై చిల్డర్న్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉండటం చూసి అవాక్కయ్యారు. దీంతో కాకతీయహిల్స్ రోడ్డులో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జాం ఏర్పడ టంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని గుమిగూడిన వారందరిని అక్కడి నుండి చెదరగొట్టారు.