బడంగ్పేట : ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 44లోని న్యూ సర్వోదయ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఇ అశోక్కు ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన రూ.60వేల చెక్కును మంత్రి సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారు ముఖ్య మంత్రి సహాయ నిధికి ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. ఇంకా ఎవరికైనా ఏ కారణాల చేత ముఖ్య మంత్రి రిలీఫ్ ఫండ్ రాకపోతే తప్పకుండా వచ్చే విధంగా చొరవ తీసుకుంటానని ఆమె అన్నారు.