శంషాబాద్ రూరల్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ ఆదివారం శంషాబాద్ మండల పరిధి మదన్పల్లి గ్రామంలోని దర్గా వద్ద (న్యాస్) వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు శంషాబాద్ ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, నార్సింగి మార్కేట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావుతో పాటు పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్లు ,ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.