మియాపూర్ : నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లను గుర్తించటంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నిరంతర నిఘాకు ఆస్కారం ఉంటుందన్నారు.
హఫీజ్పేట్ డివిజన్ జనప్రియ ఫేజ్ 1లో సీసీ కెమెరాల ఏర్పాటుకు మంజూరైన నిధుల సంబంధించిన లేఖను విప్ గాంధీ కాలనీ వాసులకు బుధవారం తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సీడీపీ నిధుల నుంచి రూ. కోటి కేటాయించినట్లు తెలిపారు.
కాలనీల్లో వీటి ఏర్పాటు విషయంలో ప్రజలలో పోలీసు శాఖ కలిపిస్తున్న అవగాహనను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు గౌతం గౌడ్, జనార్థన్, ప్రవీణ్లు పాల్గొన్నారు.