కాచిగూడ : యశ్వంత్పుర్ స్పెషల్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు నగదు, బంగారు అభరణాలను దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ప్రాంతానికి చెందిన ఆంథోని పౌల్, గ్లోరియాపౌల్ భార్యాభర్తలు. ఈ నెల 1న వారిద్దరూ నిజామాబాద్కు వెళ్లడానికి యశ్వంత్పుర్ స్పెషల్ (09302) రైలెక్కారు. రైలు మార్గమధ్యలో కాచిగూడ రైల్వేస్టేషన్లో అగింది.
రైల్వేస్టేషన్ దాటిన అనంతరం గ్లోరియాపౌల్ బ్యాగును చూసేసరికి బ్యాగులో ఉన్న 16 గ్రాముల బంగారు అభరణాలు, రూ.10 వేల రూపాయలు, ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డు, విలువైన వస్తువులు కన్పించలేదు. ఈ విషయమై నిజామాబాద్ రైల్వే పోలీసులకు గ్లోరియాపౌల్ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం కాచిగూడ పోలీస్ స్టేషన్కు శుక్రవారం బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ బీజీ ప్రసాద్ తెలిపారు.