దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. వారిని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా.. తాజాగా కూరగాయల పందిరి సాగులో రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని భావించింది. ఇందుకోసం నాగర్కర్నూల్ జిల్లాకు రూ.4.76 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలోని 136 మంది కర్షకులను లబ్ధిదారులుగా ఉద్యానవన శాఖాధికారులు గుర్తించారు. ఒక్కొక్కరికీ రూ.3.50(2.40 లక్షలు సబ్సిడీ) లక్షల చొప్పున త్వరలో పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. అధిక డిమాండ్ ఉన్న కాకర, పొట్లకాయల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పించనున్నారు.
నాగర్కర్నూల్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగా ణ) : సమైక్య పాలనలో నీరుగారిన సేద్యం.. ఇప్పుడు దేశంలోనే ముందు వరుసలో నిలుస్తున్నది. వరిపై కేంద్రం తీరుతో రానున్న రోజులు క్లిష్టంగా మారనున్నాయి. దీంతో రైతులు ఇతర పంటల సాగును చే పట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అవగాహ న కల్పిస్తున్నది. పప్పు, నూనె గింజల సాగు చేపట్టాలని సూచిస్తున్నది. దీంతోపాటు కూరగాయల సా గుతో కూడా లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. కా గా, కూరగాయల సాగుపై దళితులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పందిరి సాగు కోసం ఆర్థిక ప్రోత్సాహకం అందించనున్నది. దళిత రైతులను గుర్తించి పందిరి కూరగాయ ల సాగు చేపట్టేందుకు సబ్సిడీపై రుణాలివ్వనున్నది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు లబ్ధిదారులను గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లాలో 136 మందిని ఎంపిక చేశారు. వీరికి ఎకరానికి రూ.3.50 లక్షలను ప్రభుత్వం అందించనున్నది. ఇం దులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2.10 లక్షలు, మరో రూ.1.40 లక్షలను బ్యాంకుల నుంచి రుణం కింద ఇవ్వనున్నది. జిల్లాకు రూ.4.76 కోట్ల నిధులు మంజూరు చేసింది. దళిత రైతులకు ఉన్న భూమికి అనుగుణంగా పందిరి సాగు చేపట్టేందుకు ఆర్థిక సాయం అందనున్నది. ఇప్పటికే గుర్తించిన రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా కూరగాయల సాగు, పందిళ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులకు రుణాలివ్వనున్నారు. పందిరి సాగుతో రైతులు కూరగాయల సాగు చేపట్టి అధికంగా ఆర్జించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆహార పంటల్లో నూనె, పప్పు గింజలకు అధిక డిమాండ్ ఉన్నది. దీంతోపాటు కూరగాయలకూ మంచి ధరలు ఉన్నాయి. వరి, పత్తి, మిరప వంటి ఇతర పంటల సాగు నెలల తరబడి ఉంటుంది. ప్రకృతితోపాటు పంటల సాగు యాజమాన్యం, మార్కెట్ డిమాండ్తో రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు రావడం లేదు. అధిక పెట్టుబడులు, నష్టాలు సాధారణమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కూరగాయల సాగు రైతులకు ప్రత్యామ్నాయంగా మారనున్నది. కేవలం ఒకటి, రెం డు ఎకరాల్లో కాకర, పొట్లకాయ, దొండ, బీరకాయ వంటి లక్షల్లో విలువ చేసే పంటలు సాగు చేయొచ్చు. ఈ పంటలు నెల రోజుల్లోనే చేతికి వస్తాయి. వా రంలో రెండు సార్లు కోతలు కోసి విక్రయించొచ్చు. ఏ రోజుకారోజు ప్రత్యేక ధరలు ఉంటాయి. దీంతో రై తులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న కాకర, పొట్లకాయల సాగుపై దళిత రైతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఈ పంటలు పాదుజాతికి చెందినవి. నేలపై తగినంతగా పండవు. పందిరి సాగుతో మంచి దిగుబడి వస్తుంది. పంట కా ల పరిమితి, దిగుబడి కూడా పెరుగుతుంది. కాకరను నేల మీద సాగు చేస్తే 100-120 రోజుల్లో పూర్తవుతుంది. అదే పందిరిపై వేస్తే ఆరు నెలల వరకు కాయ లు కాస్తుంది. ఒక్కసారి పందిరి వేస్తే దాదాపుగా 20 ఏండ్లు అందుబాటులో ఉంటుంది. వైరస్ తెగుళ్లు, కలుపు సమస్య ఎక్కువగా ఉండదు. సులభంగా కాయకోతలు చేయొచ్చు. డ్రిప్ ద్వారా ఎరువులు వినియోగించొచ్చు. పందిరిపై పంట దట్టంగా అలుముకుంటుంది. తక్కువ నీళ్లు అవసరమవుతాయి.