మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో బుధవారం కోటమైసమ్మతల్లి బోనాలను గ్రామ ప్రజలు రంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలైన కోటమైసమ్మతల్లికి గ్రామస్థులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోటమైసమ్మ అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు.
అనంతరం జరిగిన ప్రత్యేక పూజల్లోపాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ మధుసూధన్ ఆద్వర్యంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటుచేసారు.