హఫీజ్పేట్ : ఆపదలో ఉన్నవారికి రక్తదానంచేస్తే ప్రాణదానంతో సమానమని ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం విజన్ వీవీకే హౌజింగ్ప్రైవేట్ లిమిటెడ్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గాంధీ తో కలిసి మంత్రి ప్రారంభించారు. అంతకుముందు విజన్ వీవీకే హౌజింగ్ ప్రైవేట్లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, ప్రముఖ సినీనటి రాశితోకలసి ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో వీవీకే యండీ విజయ్కుమార్, సీరియల్నటి మహతి, నాయకులు గోపరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గోన్నారు. తదనంతరం హుడాకాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన సాయిదీపా మల్టిస్పెషాలిటి ఆసుపత్రిని ఎమ్మెల్సీ నవీన్కుమార్, ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గాంధీ,కార్పొరేటర్లు పూజితగౌడ్, జగదీశ్వర్గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజులా రఘునాధ్రెడ్డితోకలిసి మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రిమాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు లాభాపేక్షతోకాకుండా నాణ్యతతోకూడిన మెరుగైన వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ…అత్యాధునిక వసతులతో కూడిన ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో పరసరప్రాంత ప్రజలకు మరింతమేలు చేకూరుతుందన్నారు.