అత్తాపూర్ : సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్ రాంబాగ్కు చెందిన నితీశ్ కొంత కాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ. 2 లక్షల ఎల్వోసీ మంజూరు కాగా ఆ పత్రాన్ని బాధితుడికి శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే నియోజకర్గంలో వేల మందికి సీఎంఆర్ఎఫ్లు అందించామన్నారు.
కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు మిద్దెల సురేందర్రెడ్డి, అమరేందర్, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, కోఆర్డినేటర్ శ్రీధర్రెడ్డి , నరేందర్రావు తదితరులు పాల్గొన్నారు.