చిక్కడపల్లి : సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బుధవారం గాంధీనగర్లో నలుగురు బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. సదానంద్కు రూ.45వేలు, సుజాతకు రూ.32వేలు, రాకేశ్కు రూ. 36వేలు, రవీందర్కు రూ. 11వేలు అందజేశారు.
సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు ముఠా రాకేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ప్రభాకర్, మారిశెట్టి నర్సింగ్ రావు,ఆకుల శ్రీనివాస్, గిరి తదితరులు పాల్గొన్నారు.