మణికొండ : పేదల ప్రజల పాలిట సీఎం సహాయ నిధి వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా లక్షలాది రూపాయల సహకారాలను అందించామన్నారు. అనారోగ్యం భారిన పడి చికిత్స సైతం డబ్బులు లేని పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
కోకాపేట గ్రామానికి చెందిన అమరావతి అనే మహిళా భాధితురాలికి రూ.60వేల చెక్కును స్థానిక కౌన్సిలర్ శివారెడ్డితో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.