సుల్తాన్బజార్ : ఉద్యోగుల సమస్యలతో పాటు తమ వంతు చేయూతగా పేద ప్రజలకు నిత్యం సేవ చేస్తున్న టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీకి ఉత్తమ సేవా అవార్డు వరించింది.ఈ మేరకు శ్రీ చంద్ర ఎడ్యుకేషనల్ కల్చరల్ అండ్ రిలీజియస్ చారిట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ తిరుపతి, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా ముజీబ్హుస్సేనీ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నా రు.
ఈ సంధర్భంగా ముజీబ్హుస్సేనీ మాట్లాడుతూ ఈ అవార్డు తనకు మరింత భాధ్యతను పెంచిందన్నారు. పేద ప్రజలు ఆకలితో అలమటించవద్దనే ఉద్ధేశ్యంతోనే అన్నదాన కార్యక్రమాలు, మురికి వాడలలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తన సేవలను గుర్తించి ఉత్తమ సేవా అవార్డును అందించడం పట్ల చారిట్రబుల్ ట్రస్టు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శివప్రసాద్, టీఎన్జీ వో జిల్లా శాఖ ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్, సభ్యులు ఖాలేద్ అహ్మద్, ఎంఏ ముజీబ్, పీఆర్వో జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.