వెంగళరావునగర్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయల గౌరవ ప్రతీక బతుకమ్మ పండుగని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్లోని యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్కులోని నీటి కుంటను ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లూడుతూ ..మహిళలు బతుకమ్మ ఆటలు ఆడి అనంతరం బతుకమ్మను నీటిలో విడుస్తారని బతుకమ్మ కోసం ఈ పార్కులో సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని పేద ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నామని అన్నారు.
చేనేత కళాకారులకు కూడా ఉపాధి దొరుకుతుందని చేనేత కళాకారులు తయారు చేసిన చీరలను పేద మహిళలకు అందిస్తున్నామని తెలిపారు. రూ 10 లక్షల వ్యయంతో కృష్ణకాంత్ పార్కులో ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.