వెంగళరావునగర్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం బతుకమ్మ ఉత్సవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బుధవారం శ్రీనగర్ కాలనీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్తో కలిసి మహిళలకు కానుకలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం అహర్నీశలు కృషి చేస్తుందని తెలిపారు. సంస్కృతి సంప్రదాయలతో నిర్వహించుకునే ప్రత్యేక పండుగ బతుకమ్మ పండగని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోయవర్గంలో ప్రతీ ఏటా బతుకమ్మను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
మహిళలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ప్రతి ఏడాది తన సొంత ఖర్చులతో మహిళలకు కానుకలు అందించి సన్మానించడం జరుగుతుందన్నారు. అలాగే షేక్పేట్లో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కానుకలను అందచేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివినజ్ అధ్యక్షుడు అప్పుఖాన్,ప్రధాన కార్యదర్శి శరత్ గౌడ్. తన్ను ఖాన్, మధు యాదవ్, పార్టీ డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్కుమార్,ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.