నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7 : రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేదాకా రైతుల పక్షాన పోరాడుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్తో గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి అల్లోల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర వైఖరిని ముందే గమనించిన సీఎం కేసీఆర్ పంటను తగ్గించాలని, రైతులకు సూచిస్తే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తాము బాజాప్తా కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులకు రైతులపై ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన టీఆర్ఎస్ అనేక రూపాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉందన్నారు. శుక్రవారం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల దహనం, ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్ర వైఖరిని ఎండగట్టాలన్నారు. అంతకుముందు రైతులు మంత్రికి నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రామిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, నాగేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాజేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రాము, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
అపుడు ఉమ్మడి రాష్ట్రంల జిల్లాని కరువు ప్రాంతంగ ప్రకటించాలని మా మండలంల ( అపుడు తాంసి) కరంజి(టి) గ్రామం నుంచి ఉద్యమం సూరయింది. అది రాష్ట్రం మొత్తం పాకింది. తర్వాత దిగి అచ్చిండ్రు. ఇగో ఇపుడు సుకా కేంద్రం వరికొనాలని మా మండలం ముందట్నుంచి ఆందోళనల్ల ముందున్నది. ఇగ అమరణదీక్షకు సూత తయారైతానం. బీజేసీ సర్కారుకు రోజులు దగ్గర వడ్డట్టున్నయి. గందుకే గిట్ల విపరీత బుద్దులు పుడుతున్నయి. ఇప్పటికైనా మోదీసారు దిగిరావాల. రైతులకు ఇన్ని పథకాలు ఇస్తున్నది కేసీఆర్ సారుకాక మరొకరు ఉన్నరని బీజేపొళ్లు, కాంగ్రెసోల్లు నిరూపిస్తే రైతుబంధు అధ్యక్ష పదవికి రాజీనామా చేస్త.
– మార్సెట్టి అనిల్,
సెంటర్ లీడర్లు వడ్ల కిరికిరి వెట్టి అరిగోస వెడుతున్నరు. రైతులను ఇబ్బంది వెట్టాలని సూస్తే, ఇగ గట్టిగనే దెబ్బ తాకుతది. నేను ఇపుడంటున్నది ఇంకా గొన్ని రోజులల్ల గుర్తవుతది. నాకున్న ఐదెకరాలల్ల 2 ఎక్కర్లు అరి ఏసిన. ఇపుడెట్ల జేసుడో అర్థం కావట్లే. అయినాగానీ నాకు, నాతోటి కాస్తకారికి సీఎం కేసీఆర్సారు మీదనే నమ్మకం ఉన్నది. సెంటర్ల ఉన్న బీజేపీ సర్కారు మీద రైతులకు నమ్మకం పోయింది. మా ఎమ్మెల్యే జోగు రామన్నతోటి యాడికంటే ఆడికి వోయి హర్తాల్ చేసేతందుకు తయారున్నం. రైతులను ఇక్కట్లు వెడితే ఏం జేయాల్నో మాకు బాగా తెలుసు. కొట్లాడుటానికైనా సిద్ధం. ఉద్యమాలకు కూడా వెనుకాడం.
– మాధవరావు, రైతు, వాన్వట్, ఆదిలాబాద్ మండలం