గోల్నాక : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాచకొండ పోలీసులు ఆయధ పూజ నిర్వహించారు. బుధవారం అంబర్పేటలో కార్ క్వార్టర్స్లో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్భగవత్ వేదమంత్రాల నడుమ తమ ఆయుధాలకు శాస్త్రయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాలకు పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.