పెద్దేముల్, డిసెంబర్ 8: యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏఈవో వినయ్ అన్నారు. పెద్దేముల్ గ్రామ పం చాయతీ ఆవరణలో యాసంగి సీజన్లో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈవో వినయ్ మాట్లాడుతూ రైతులు యాసంగి సీజన్లో ఉత్పత్తి చేసే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనడం లేదని, వరి ధాన్యాన్ని కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఉండవని, వరి పంటలు వేసి రైతులు నష్టపోవద్దన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యులు కిషన్రావు,మాజీ సర్పంచ్ ఎర్రబాలప్ప, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు డీవై నర్సింహులు ఉపేందర్, రాములు, మాణి క్యం, పంచాయతీ కార్యదర్శి సుధారాణి పాల్గొన్నారు.
ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి
దోమ, డిసెంబర్8: యాసంగి సీజన్లో ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్ సర్పంచ్ రాజిరెడ్డి పేర్కొన్నారు.బుధవారం దోమ మండల కేంద్రంలోని డీసీఎంఎస్ గోదాము ముందు ఏఈవో కావ్యతో కలిసి పంటల సాగు క్యాలెండర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏఈవో కావ్య మాట్లాడు తూ రైతుల మేలు కోరి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలను పాటించాలన్నా రు. ఆరుతడి పంటలను సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తామ న్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్గౌడ్, గ్రంథాల డైరె క్టర్ యాదయ్యగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, రైతు సంఘం అధ్య క్షుడు బోయిని బుచ్చయ్య పాల్గొన్నారు.
ఇతర పంటలపై అవగాహన
దౌల్తాబాద్ డిసెంబర్8: యాసంగి సీజన్లో వరికి బదులు ఇతర పంటలు వేయాలని వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం మండలం లోని గోకఫస్లవాద్ గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా ఏఈవో శ్రీపతిరెడ్డి మాట్లాడుతూ వరిపంటకు బదులు అధిక లాభాలు వచ్చే పంటలపై రైతులు మొగ్గుచూపాలన్నారు. వ్యవసాయాధి కారులు సలహాలు తీసుకుని పంటలు సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
లాభదాయక పంటలు వేయాలి
కోట్పల్లి, డిసెంబర్ 8 : మండలంలోని జిన్నారం గ్రామ రైతులకు ఆరుతడి పంటలపై బుధవారం వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి అయ్యప్ప మాట్లాడుతూ యాసంగి సీజన్ లో ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల అధిక దిగుబడి సాధించి అధిక లాభాలు పొందే అవకాశముందన్నారు. బోర్ల కింద లాభదాయక పంటలైన వేరు శనగ, కుసుమ, జొన్న పంటలు వేయాలన్నారు.
రైతుల మేలు కోసమే ఈ నిర్ణయం
బషీరాబాద్, డిసెంబర్ 8: యాసంగిలో వరి పంటకు బదులు ఇతర పంట లు సాగు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్ రైతు లకు సూచించారు. బుధవారం మండల పరిధిలో మాసన్పల్లి, కొర్విచేడ్, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇతర పంటలపై అవగాహన కల్పించారు. వరికి బదులుగా నల్లకుసుమ, మొక్కజొన్న, పెసర, మినుము, కూరగాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రైతుల మేలు కోసమే ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం ఇతర పంటల సాగు పోస్టర్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బీమప్ప ఉన్నారు.
ప్రభుత్వ సూచనలు పాటించాలి
మోమిన్పేట, డిసెంబర్ 8: రైతులు ప్రభుత్వ సూచనలు పాటించి వరికి బదులు అధిక లాభాలు వచ్చే పంటలను సాగు చేసుకోవాలని ఏవో రాధా రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఇజ్రా చిట్టేంపల్లి, దుర్గం చెర్వు, మక్తతండా గ్రామాల్లో ఏఈవో ఇతర పంటలపై అవగాహన కల్పిం చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరిని సాగు చేసి రైతులు నష్ట పోవద్దన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు పాల్గొన్నారు.