హఫీజ్పేట్ : మదీనగూడ మైహోం జ్యువెల్స్ గేటెడ్ కమ్యూనిటీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా రెండు పురస్కారా లను సొంతం చేసుకున్నది. తెలంగాణ టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లయన్స్క్లబ్ ఆఫ్ యువ సంయుక్త అధ్వర్యంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డుల పోటీల్లో నగర వ్యాప్తంగా ఉన్న 28అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ లు పోటీపడ్డాయి. ఉత్సవాల నిర్వహణ, పర్యావరణపరిరక్షణతోపాటు పలుఅంశాలను పరిగణనలోకి తీసుకొనగా మైహోం జువెల్ విజేతగా నిలిచి గ్రాండ్గణేశా 2021, తెలంగాణ టూరిజం రత్న 2021 లను సొంతంచేసుకుంది.
ఈమేరకు మైహోంజ్యువెల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్ గుప్తా, మైంహోం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూపల్లి వినోద్, లయన్స్క్లబ్యువ అధ్యక్షుడు సౌరభ్ సురేఖ ముఖ్యఅతిధులుగా హజరై మైంహోం జ్యువెల్స్ సంక్షేమసంఘం అధ్యక్షుడు పి. మురళీధర్రావుకు అవార్డులను అందజేశారు.కార్యక్రమంలో కార్యదర్శి నందకిషోర్, ప్రతినిధులు అర్జున్రావు, ఎన్సీ గుప్తా పాల్గొన్నారు.