మెహిదీపట్నం : రోడ్డుపై పడిపోయిన సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడో ఆటో డ్రైవర్ .ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
సోమవారం లంగర్హౌస్ హాశం నగర్కు చెందిన మీర్జా సుల్తాన్బేగ్ (29)తన భార్య సమీరా బేగం తో కలిసి మెహిదీపట్నం నుంచి రేతిబౌలీ మీదుగా తమ బైక్పై లంగర్హౌస్ వచ్చారు. ఈ క్రమంలో వారు తమ బంగారు ఆభరణాల పర్సును పోగొట్టుకున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఆసిఫ్నగర్ మురాద్నగర్ సయ్యద్ అలీగూడకు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ జాకీర్ (34) తనకు పిల్లర్ నెంబర్ 55 వద్ద దొరికిన పర్సు గురించి లంగర్హౌస్ పోలీసులకు సమాచారం అందించాడు.
అంతేకాకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆభరణాల పర్సును పోలీసులకు ఇచ్చాడు. బాధితులు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారని,మంగళవారం ఆటో డ్రైవర్ తనకు దొరికిన పర్సు తెచ్చి ఇవ్వడంతో బాధితులను పోలీస్ స్టేషన్కు పిలిచి ఆభరణాలను తిరిగి ఇచ్చామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆటో డ్రైవర్ సయ్యద్ జకీర్ను అదనపు ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డితో కలిసి సన్మానించారు.