బండ్లగూడ : భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు చేరుతుండడంతో అధికారులు రెండు జలాశయాల గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. మంగళవారం హిమాయత్సాగర్కు చెందిన పది గేట్లను ఎత్తి వేసి నీటిని విడుదల చేయగా ఉస్మాన్సాగర్కు చెందిన ఆరు గేట్లను ఎత్తి వేశారు. దీంతో ఈసీ, మూసీ నది పరవళ్లు తొక్కింది.
హిమాయత్సాగర్ గేట్లను ఎత్తివేయడంతో శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్, ఇన్స్పెక్టర్ కనకయ్య, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్లు అక్కడికి చేరుకుని నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. కాగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మూసీ, ఈసీ పరివాహక ప్రాంతాలలో నివాసితులను అప్రమత్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాపయ్య యాదవ్ అధికారులతో కలిసి మూసీ, ఈసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.