సైదాబాద్ : సింగరేణికాలనీలో వివాదస్పద ఖాళీ స్థలాన్ని కబ్జా చేయటానికి ప్రయత్నాలు చేసిన 14మందిపై సైదాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం…ప్రకారం సింగరేణికాలనీ చర్చి సమీ పంలోని వివాదస్పద ఖాళీస్థలాన్ని రెండు వర్గాలకు చెందిన వారు గుడిసెలు వేసి కబ్జా చేయటానికి ప్రయత్నాలు చేశారు.
కొంతమంది స్థానిక నాయకుల అండతోపాటు మరి కొందరి సహకారంతో స్థానికేతర ప్రాంతానికి చెందిన వ్యక్తి తన అనుచరులతో కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ స్థానికులు కొంతమంది అదే స్థలంలో గుడిసెలు వేయటానికి ప్రయత్నాలు చేశారు.
దీంతో ఇరువర్గాల మద్య వాగ్వివాదం ఘర్షణకు దారితీసి, దాడులకు పాల్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దాడులకు పాల్పడ్డ ఇరువర్గాలకు చెందిన 14మందిపై కేసులను నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.