బండ్లగూడ : అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వాటిని అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులు,బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ సిబ్బందిని ఇష్టానుసారం మాట్లాడడమే కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై హెచ్ఎండీఏ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారి కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం…బండ్లగూడ జాగీర్ పరిధిలోని ఎన్ఎఫ్సీ కాలనీలో కాంగ్రెస్ నాయకుడు సంజీవరెడ్డి రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తుండటంతో అధికారులు గురువారం కూల్చి వేసేందుకు అ భవనం వద్దకు వెళ్లారు.
దీంతో అక్కడే ఉన్న భవన యాజమాని సంజీవరెడ్డి అధికారులపై దాడికి యత్నించడంతో పాటు దుర్బాషలాడారని ప్లానింగ్ అధికారి కోటేశ్వరరావు తెలిపారు.అయినప్పటికీ అధికారులు పోలీస్ బందోబస్త్తో అ భవనాన్ని కూల్చివేశారు. అనంతరం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.