ముషీరాబాద్ : టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్లోని 11 కేవీ వైఎంసీఎ, బసంత్న కాలనీ, సీసీ షరాఫ్ ఆసుపత్రి, టూరిస్టు హోటల్, ప్రేమ్నగర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
వైఎంసీఎ ఫీడర్ పరిధిలోని నారాయణగూడ బ్లడ్ బ్యాంక్, లింగంపల్లి వాటర్ వర్కు, రాఘవేంద్ర స్వామి టెంపుల్, నృప తుంగ కాలేజ్, పోలీసు క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయ నున్నట్లు పేర్కొన్నారు.
బసంత్ కాలనీ ఫీడర్ పరిధిలోని బసంత్ కాలనీ, లింగంపల్లి, వైశ్య హాస్టల్, వెంకటరమణ థియేటర్, జైన్ మందిర్, కాచిగూడ ఎక్స్ రోడ్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 11.30 నుంచి 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనున్నట్లు తెలిపారు.
ప్రేమ్నగర్ ఫీడర్ పరిధిలోని పటేల్నగర్ రస్తా, ప్రేమ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సీసీ షరాఫ్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలోని సీసీ షరాఫ్, రాజేంద్రనగర్ కాలనీ, భూమన్న గల్లీ, పార్ట్ ఆఫ్ లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురు పరిసరాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, టూరిస్టు హోటల్ ఫీడర్ పరిధిలోని కాచిగూడ మొయిన్ రోడ్, టూరిస్టు హోటల్, బజాజ్ షోరూం, చెప్పల్ బజార్, కుత్బిగూడ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.