శంషాబాద్ రూరల్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా, ఒమిక్రాన్ వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంతో ప్రపంచదేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రజల నుంచి అధికంగా వైరస్ వ్యాపించే అవకాశం ఉందన్నారు.
వివిద దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల నుంచి ఇక్కడి ప్రజలకు వైరస్ సోకకుండా కట్టడి చేయడం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావుల ఆధ్వర్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.