నారాయణపేట టౌన్, జనవరి 6 : విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని కలెక్టర్ హరిచందన వి ద్యార్థులకు సూచించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం వాయిస్ ఫర్ గర్ల్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 28 నుంచి ఏర్పాటు చేసిన దిశ వింటర్ క్యాంప్ 2021 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి హా జరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ ఎదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే తపన కలిగి ఉండి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు. నేర్చుకోవడం ఆగిపోయినప్పుడు మనిసి ఎదుగుదల ఆగిపోతుందన్నారు. విద్యార్థులు చదువు మాత్రమే కా కుండా అభిరుచులకు అనుగుణంగా క్రీడలు, సంగీతం, నా ట్యం లాంటి వాటిని నేర్చుకోవాలని సూచించారు. జిల్లాలోని 5 పాఠశాలల నుంచి 118 మం ది యుక్త వయస్సు బాలికలకు సాధికారత కల్పించేందుకు వివిధ రకాలైన అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం దిశ ప్రధాన లక్ష్యమన్నారు. వేసవికాలం లో మరో సఖి కార్యక్రమం నిర్వహిస్తామని వాయిస్ ఫర్ గర్ల్స్ డైరెక్టర్ అనూ ష భరద్వాజ్ తెలిపారు. అనంతరం వి ద్యార్థులు బాల్య వివాహాలపై నాటక ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో వా యిస్ ఫర్ గర్ల్స్ ఫీల్డ్ కో ఆర్డినేటర్ అని షా కున్వర్, పాఠశాల ప్రిన్సిపాల్ దేవసేన, విద్యార్థులు పాల్గొన్నారు.