ఆదిలాబాద్ టౌన్, మే 3 : జిల్లా వ్యాప్తంగా ముస్లింలు మంగళవారం ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదిలాబాద్లోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని వివిధ కాలనీల నుంచి వేలాది మంది తరలిరావడంతో ఈద్గా మైదానం ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు యూనిస్ అక్బానీ, కాంగ్రెస్ నాయకుడు సాజిద్ఖాన్ ఈద్గా మైదానానికి వచ్చి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇచ్చోడ, మే 3 : మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం సమీపంలోని ఈద్గా మైదానం వద్దకు పెద్దసంఖ్యలో ముస్లింలు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతగురువు ముజీబ్ రెహమాన్ ఇషాతి రంజాన్ విశిష్టత గురించి ప్రసంగించారు. ఈద్గా వద్ద సీఐ రమేశ్ బాబు, ఎస్ఐ ఉదయ్ కుమార్, ఏఎస్ఐ లింబాద్రి ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.
గుడిహత్నూర్, మే 3 : మండల కేంద్రంతో పాటు సీతాగోంది, మన్నూర్, తోషం, శాంతాపూర్ గ్రామాల్లో ముస్లింలు రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తమ బంధువులు, మిత్రులు ఇండ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సిరికొండ, మే 3 : మండల కేంద్రంలోని ఈద్గా వద్దకు మతపెద్దలు, ముస్లింలు పెద్దసంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద సిరికొండ ఎస్ఐ నీరేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
తలమడుగు, మే 3 : రుయ్యాడిలో హస్సేన్ హుస్సేన్ ఆలయం వద్ద హిందువులు ముస్లింలకు సేమియా పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎస్డీడీసీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, సర్పంచ్ పోతారెడ్డి, గ్రామస్తులు శ్రీనివాస్, ప్రకాశ్ రెడ్డి, గోక భూమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్/ఉట్నూర్రూరల్, మే 3 : మండల కేంద్రంతో పాటు దంతన్పల్లి, బీర్సాయిపేట, నాగాపూర్, శ్యాంపూర్ గ్రామాల్లో ముస్లింలు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, భరత్ చౌహాన్, మర్సుకోల తిరుపతి, నాయకులు, ఉట్నూర్ సీఐ సైదారావు, ఎస్ఐలు ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, దాసండ్ల ప్రభాకర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీమొద్దీన్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ పాల్గొన్నారు.
నార్నూర్/ఇంద్రవెల్లి, మే 3 : నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ మండలాల్లో ముస్లింలు ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, షేక్ సుఫియాన్, యాకుబ్బేగ్, తదితరులు పాల్గొన్నారు.
బేల, మే 3 : మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సర్పంచ్ ఇంద్రశేఖర్, నాయకులు ప్రమోద్ రెడ్డి, సతీశ్ పవార్, దేవన్న, దేవీదాస్, రవికుమార్, సంజయ్ గుండవార్ , రూప్రావు ఈద్గా వద్దకు వచ్చి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బేల ఎస్ఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
బోథ్/నేరడిగొండ, మే 3 : బోథ్, సొనాల, నేరడిగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఎంపీపీ తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ రుక్మాణ్సింగ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, నాయకులు పాల్గొన్నారు.