మహబూబ్నగర్, జనవరి 7: గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద శుక్రవారం గిరిజన ఉద్యోగుల సంఘం నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రూ.13కోట్ల వ్యయంతో గిరిజనుల కోసం సేవాలాల్ మహరాజ్ భవనంతోపాటు గిరిజన మహిళా ఉద్యోగినుల వసతిగృహం, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల, ఉద్యోగుల సంఘం భవనాలను నిర్మిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నదని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తండాలకు కోట్ల రూపాయలు ఖర్చుచేసి బీటీ రోడ్లు వేస్తున్నామన్నారు. భవిష్యత్లో గిరిజన తండాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో పీయూ వైస్ చాన్స్లర్ లక్ష్మీకాంత్రాథోడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ తాటి గణేశ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు రాజునాయక్, ఉద్యోగుల సంఘం కార్యదర్శి చందర్నాయక్, ఉద్యోగుల సంఘం కార్యదర్శి యాదగిరి, లక్ష్మణ్నాయక్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్నాయక్, గోవిందనాయక్, లక్ష్మణ్నాయక్, కౌన్సిలర్లు లక్ష్మన్, విట్టల్నాయక్, రవిచిల్డ్రన్స్ దవాఖాన అధినేత శేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఇశ్రానాయక్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలమర్రికి పూర్వవైభవం తీసుకొద్దాం
పిల్లలమర్రికి పూర్వవైభవం తీసుకొచ్చి అద్భుతంగా తీర్చిదిద్దుదామని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రిని శుక్రవారం మంత్రి పరిశీలించారు. పిల్లలమర్రిలో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలమర్రి చౌరస్తా విస్తరణ, బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు. ఆసియాఖండంలోనే అతిపెద్ద మర్రి చెట్టు పిల్లలమర్రి అని తెలిపారు. అదేవిధంగా పిల్లలమర్రి వద్ద ఉన్న దర్గాలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక ప్రార్థన చేశారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ తాటి గణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు రామ్లక్ష్మణ్, రోజా తిరుమల వెంకటేశ్, జాజిమొగ్గ నర్సింహులు, కిశోర్ తదితరులు ఉన్నారు.
అందరికీ సముచిత స్థానం
అందరికీ సముచితస్థానం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆశకార్మికులు, పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచినందుకుగానూ శుక్రవారం పిల్లలమర్రి చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఆశలకు రూ.7,500 నుంచి రూ. 9,750, పారిశుధ్య కార్మికులకు రూ. 12వేల నుంచి రూ.15,600లకు పెరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు రుణపడి ఉందామని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పలువురు కార్మికులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ మిఠాయి తినిపించారు.
విద్యతోనే బంగారు భవిష్యత్
మహబూబ్నగర్టౌన్, జవవరి 7: విద్యతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని ఎక్సైజ్శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జేపీఎన్సీఈ కళాశాల సిల్వర్ జూబ్లీ పూర్తిచేసుకున్న సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించారు. ఆదేవిధంగా వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, క్రీడాపోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులను మంత్రి ప్రదానం చేసి మాట్లాడారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్, ప్రిన్సిపాల్స్ సుజీవన్కుమార్, చంద్రశేఖర్, కౌన్సిలర్ కిశోర్, నాయకులు లక్ష్మణ్, శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.