మన్సూరాబాద్ : పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మన్సూరాబాద్ డివిజన్లో పూర్తి చేసిన టీఆర్ఎస్ కాలనీ కమిటీల లిస్ట్ను శుక్రవారం ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని త్వరలో డివిజన్ పరిధిలోని అన్ని స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
పేదల కోసం పార్టీ చేపడుతున్న అభివృద్ధిపనులు, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్పర్సన్ ఈశ్వరమ్మయాదవ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, కొసనం వెంకట్రెడ్డి, రుద్ర యాదగిరి, టి. మోహన్రెడ్డి, సంతోష్ గుప్త, నరి వెంకన్న కురుమ, ఆనంద్యాదవ్, పారంద నర్సింగ్రావు, కేకేఎల్ గౌడ్, సిద్దగోని జగదీష్ గౌడ్, పండుగ ప్రవీణ్ ముదిరాజ్, ఏలుకొండ రాంకోటి, సీహెచ్. బాల్రాజు గౌడ్, నర్సింహా, నరి అంజయ్య, నాంపల్లి బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.