శంషాబాద్ రూరల్ : శంషాబాద్ పట్టణంలోని సామాజిక దవాఖానతో పాటు నర్కూడ, పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బుధవారం 220 మందికి పరీక్షలు చేయగా 41 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవ్వరికైన అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నారు.