సూర్యాపేట, నవంబర్ 29 : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 21మంది బాధితులు వివిధ సమస్యలపై దరఖాస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించాక వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయాధికారులు రైతులకు అండగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ఓ విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, ఏడీఏ రామారావునాయక్, పులి సైదులు, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
పిల్లల రక్షణకు చర్యలు తీసుకోవాలి
సూర్యాపేట : పిల్లల రక్షణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు అన్నారు. సోమవారం తన ఛాంబర్లో వివిధ బాధిత పిల్లలకు ప్రభుత్వ ప్రోత్సాహకం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత పిల్లలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించడంలో మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ముందుండాలని సూచించారు. బాలికల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఈ సందర్భంగా చింతలపాలెం మండలానికి చెందిన ముగ్గురు బాధిత పిల్లల తల్లిదండ్రులకు తక్షణ సాయంగా రూ.25వేల చొప్పున చెక్కులు అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జ్యోతి పద్మ, బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ ఆర్.వెంకటలక్ష్మి, రవికుమార్, సంపత్కుమార్ పాల్గొన్నారు.