అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి
ఎల్బీనగర్, నవంబర్ 28: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం యువత కల, అది సాకారం చేసుకునే క్రమంలో కొందరు సఫలమవుతుండగా మరికొందరు విఫలమవుతున్నారని, సరైన ప్రణాళిక, కృషి, పట్టుదల లేకపోతే ఏదీ సాధ్యం కాదని అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థుల కోసం శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో దిల్షుఖ్నగర్లోని పాణనీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉచిత డెమో, టాలెంట్ టెస్ట్ను ఆదివారం నిర్వహించారు. టాలెంట్ టెస్టుకు సు మారు రెండువేల మంది హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ మధుకర్స్వామి మాట్లాడుతూ శ్యామ్ ఇనిస్టిట్యూట్ సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్లలో ఈ పరీక్షను నిర్వహించడం యువతకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన వందమంది అభ్యర్థులకు కోచింగ్ ఫీజులో 60శాతం రాయితీ కల్పించడం, పరీక్షలకు హాజరైన వా రికి ఉచిత బుక్ మెటీరియల్ కూడా అందించడం మం చి పరిణామమన్నారు. నోటిఫికేషన్స్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో యువత సన్నద్ధం కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్ను పరిశీలించి తమ అర్హతలకు తగిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మదీన, సంతోష్రెడ్డి, శేఖర్, మణికంఠ, దాట్ల రామకృష్ణరాజు, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.