మన్సూరాబాద్, నవంబర్ 27: కులవృత్తుల పరిరక్షణ కోసం గౌడ సంఘం నాయకులు పాటుపడుతూ తాటి,ఈత మొక్కలు నాటేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి నాగోల్ గౌడ సంఘం, కల్లు గీత కార్మిక సం ఘం ఆధ్వర్యంలో శనివారం కాత్యాయని గార్డెన్లో తాటి,ఈత మొక్కలు నాటుదాం గౌడ కులవృత్తిని కాపాడుదాం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథులు గా హాజరై ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో పది సంవత్సరాల వయస్సు కలిగిన ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణ, మాజీ కార్పొరేటర్ సంగీత, నాయకులు రాజిరెడ్డి, కన్నాగౌడ్, జంగయ గౌడ్, కృష్ణ, రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు త్వరలో పూర్తి చేస్తాం
హయత్నగర్, నవంబర్ 27: హయత్నగర్ పాత గ్రామంలో పెండింగ్లోని పనులను త్వరలోనే పూర్తిచేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. శనివారం టీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో పలుకాలనీల ప్రజలు ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి సమస్యలను వివరించారు.ఎమ్మెల్యేను కలిసిన వారిలో పార్టీ యూత్ సెల్ అధ్యక్షుడు రాకేశ్కుమార్, యువజన నాయకులు సందీప్, సూర్యనగర్కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, జైపాల్రెడ్డి, శ్రీకాంత్, శంకరయ్య, యాదగిరి, దత్తాత్రేయనగర్ కాలనీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.