ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్టౌన్, జనవరి 25: క్రీడాభివృద్ధికి ప్రభు త్వం అన్నివిధాలా కృషి చేస్తుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మం త్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని రామయ్యబౌలిలో నిర్వహిస్తున్న తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ రూరల్ వాలీబాల్ టోర్నీకి మంత్రి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులకు అన్నివసతులు కల్పిస్తున్నామని, క్రీడామైదానాలు, వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామన్నారు. క్రీడాకారులకు అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వాలీబాల్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నవీరయ్య, నాయకులు మతీన్, సుల్తాన్, ఖుద్దుస్బేగ్, అన్ను తదితరులు పాల్గొన్నారు.
సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన
జిల్లాకేంద్రంలోని మర్లులో రూ.45లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేశారు. ఆయన వెంట షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్లు నరేందర్, అనంతరెడ్డి, మాజీ కౌన్సిలర్ పిల్లి అనిత తదితరులు పాల్గొన్నారు